ఎటు పోతొంది దేశం?
ఆలోచించూ నేస్తం!
చుట్టూ చీకటి, మదిలో చీకటి
వెలిగించూ చిరు దీపం!
విద్యార్థులమని అంటారు
కళాశాలలకు వస్తారు
సమ్మెలు చేస్తూ ఉంటారు
చదువుకు నామం పెడతారు
ప్రజా సేవకులమంటారు
ప్రభుత్వ సంస్థల నుంటారు
లంచాలను తెగ మేస్తారు
నీతికి గంతలు కడతారు
ప్రజా నాయకుల మంటారు
ఎన్నిక లెన్నిక లంటారు
ఓట్లకు నోట్లను ఇస్తారు
భ్రష్టులే నాయకులవుతారు
గంగా యమునలు పారేటి
ధర్మ భూమి యని అంటారు
ధర్మో రక్షతి రక్షితః
ఈ సూత్రం తెలియక వున్నారు
No comments:
Post a Comment